పిల్లలు ఎల్లప్పుడూ రంగురంగుల సాఫ్ట్ టాయ్స్తో ఆడుకోవడం ఇష్టపడవచ్చు, వారికే కాదు దుమ్ములో పెరిగే పురుగులకు కూడా అవి ఇష్టమే అని మీకు తెలుసా!
ఒక తల్లిగా, స్తుతి అగర్వాల్కి తన పెద్ద కొడుకును ఇబ్బంది పెట్టే డస్ట్ మైట్ అలెర్జీ గురించి ఎల్లప్పుడూ ఆందోళన ఉండేది. ఆమె తీసుకున్న జాగ్రత్తలలో ఒకటి తన ఇంట్లో ఉన్న సాఫ్ట్ టాయ్స్ను తన పిల్లలకు అందకుండా ఉంచడం. అడవి జంతువులు మరియు పెంపుడు జంతువుల నమూనాలైన రంగురంగుల సాఫ్ట్ టాయ్స్ పిల్లలను మాత్రమే కాకుండా క్రిములను కూడా ఆకర్షిస్తాయి.
ముంబైకు చెందిన అగర్వాల్ అనే బ్లాగర్ తన నాలుగున్నరేళ్ళ కొడుకు డస్ట్ మైట్ అలెర్జీని ఎదుర్కొంటున్నాడని మరియు దాని కారణంగా తుమ్ములు మరియు ముక్కు కారడం వంటి లక్షణాలను ఎదుర్కొంటున్నాడని చెప్పారు. నాలుగు సంవత్సరాల క్రితం, వారి కుటుంబం హాంకాంగ్లో నివసించినప్పుడు, ఆమె కుమారుడికి తరచుగా దద్దుర్లు వచ్చేవి, తల్లిదండ్రులు అసలు సమస్య ఏమిటో గుర్తించ లేకపోయారు. “హాంకాంగ్లోని వైద్యులను తరచుగా సంప్రదించడం అంత సులభం కాదు. హాంకాంగ్లో డస్ట్ మైట్ ఎలర్జీ చాలా సాధారణం అయినప్పటికీ ఒక వైద్యుడిని మేము కలిస్తే అతడి ప్రకారం అవి దద్దుర్లే. అప్పుడు మా కొడుకు వయసు కేవలం పది నెలలే. మేము ముంబైకు మారినప్పుడు, అది తుమ్ములు మరియు ముక్కు కారడంతో మరింత తీవ్రమైంది. డస్ట్ మైట్ అలెర్జీ అని వైద్యులు చెప్పారు” అని ఆమె చెప్పింది.
తాము సంప్రదించిన వైద్యులు సాఫ్ట్ టాయ్స్ అస్సలు ఇంట్లో ఉండకూడదు అని ఖచ్చితంగా చెప్పారు అని ఆమె గుర్తు చేసుకున్నారు. కొన్నేళ్ళుగా ఆమె భర్త ఆమెకు బహుమతిగా ఇచ్చిన బొమ్మలను ఇప్పుడు ప్లాస్టిక్తో చుట్టి దూరంగా ఉంచారు. “మృదువైన బొమ్మలు మైట్లకు పెద్ద ఆకర్షణ. చాలా ఆకర్షణీయంగా కనిపించే మెత్తటి బొమ్మలు అధ్వాన్నంగా ఉంటాయి. మేము తరచుగా శుభ్రం చేయగలిగే చెక్క బొమ్మలను మా పిల్లలకు ఇచ్చాము” అని అగర్వాల్ చెప్పారు.
మృదువైన బొమ్మలను ఎలా కడగాలి
“మనం పిల్లలకు అత్యంత దగ్గరగా ఉండే బొమ్మలను తేలికగా తీసుకుంటాము. పిల్లలలో తరచుగా కనిపించే అలర్జీలతో, మృదువైన బొమ్మలు ఇంటిలోని దుమ్ముతో వచ్చే క్రిములను కలిగి ఉన్నాయి అని మేము గుర్తించాము” అని పూణేలోని అపోలో క్లినిక్ సీనియర్ శిశువైద్యులు డాక్టర్ అనుపమ సేన్ చెప్పారు. దద్దుర్లు, జలుబు లేదా కళ్ళ నుండి నీరు కారడం వంటి అలర్జీలను మైట్స్ కలిగిస్తాయని ఆమె చెప్పారు.
ఎటాపిక్ డెర్మటైటిస్ అని పిలువబడే తీవ్రమైన పొడి చర్మం ఉన్న పిల్లలు డస్ట్ మైట్ అలెర్జీకి ఎక్కువ ప్రభావితం అయ్యే హాని ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. సాఫ్ట్ టాయ్స్పై క్రిములు పడితే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది.
“ఇలాంటి అలెర్జీలు కొనసాగితే, అది ఆస్తమాకు దారితీయవచ్చు. పిల్లలకు పర్యావరణం నుండి వచ్చే అలెర్జీ కారకాల వల్ల ఆస్తమా వస్తుంది. దుమ్ములో ఉండే క్రిములు పిల్లల ఉయ్యాలలు, తొట్టి, మంచం లేదా పరుపులో కూడా ఉండవచ్చు” అని డాక్టర్ సేన్ చెప్పారు. సాఫ్ట్ టాయ్స్ పిల్లలలో అలెర్జీలకు మూలం కాగలవని అనేక సర్వేలు నిస్సందేహంగా నిరూపించాయి. “పిల్లలకు మృదువైన బొమ్మలు ఇవ్వడంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అన్ని బొమ్మలను కడగాలి, శుభ్రం చేయాలి మరియు బాగా ఆరబెట్టాలి” అని డాక్టర్ సేన్ అభిప్రాయపడ్డారు.
మృదువైన బొమ్మలను ఎలా శుభ్రం చేయాలి
డాక్టర్ సేన్ ప్రకారం, ఉష్ణమండల ప్రాంతాలలో ఉండే వారు ఇంట్లోని బొమ్మలను శుభ్రం చేయడానికి ఉత్తమ మార్గం ద్రవ రూపంలోని డిటర్జెంట్తో పాటు యాంటిసెప్టిక్ ద్రవాలతో వాటిని ఉతికి, ఎండలో ఆరబెట్టడం. తేమ మరియు వేడి కారణంగా ఉష్ణమండల వాతావరణంలో మైట్స్ వృద్ధి చెందుతాయని ఆమె పేర్కొంది. “టీదర్లు, గట్టి బొమ్మలు మరియు లాగుతూ ఆడుకునే వీలుండేవి వంటి అన్ని బొమ్మలను మీరు పిల్లలకు ఇచ్చే ముందు వాటిని కడిగి శుభ్రం చేయాలి. అదే సమయంలో, వాక్యూమింగ్ ద్వారా మిగిలిన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. పరుపులను వాక్యూమ్తో శుభ్రం చేసి ఎండలో ఆరబెట్టవచ్చు. ఎండలో ఆరబెట్టడం అనేది క్రిములను దూరంగా ఉంచే మార్గాలలో ఒకటి. అన్ని మృదువైన బొమ్మలు అలెర్జీని తీవ్రతరం చేయవు. ఉపరితలంపై క్రిములు చేరినవి మాత్రమే అలెర్జీకి దోహదం చేస్తాయి” అని ఆమె చెప్పారు. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో అంటే ఇంకా పూర్తిగా నడవటం కూడా ప్రారంభించని పిల్లలలో డస్ట్ మైట్ అలెర్జీ ఎక్కువగా కనిపిస్తుందని ఆమె చెబుతుంది. “వారు పాఠశాలకు వెళ్ళడం ప్రారంభించినప్పుడు, ఇతర పనులలో తమను తాము బిజీగా ఉంచుకుంటారు, ఇతర పిల్లలతో ఆడుకోవడం ప్రారంభిస్తారు. అందువల్ల, బొమ్మలతో ఆడటం క్రమంగా తగ్గుతుంది, ”అని ఆమె చెప్పింది.
పిల్లలకు బొమ్మలు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని, 12 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు నిద్రపోయేటప్పుడు బొమ్మలు పక్కన పెట్టుకోకూడదని కూడా డాక్టర్ సేన్ చెప్పారు. “బొమ్మ శ్వాస తీసుకోడానికి అడ్డుగా ఉంటే వారి ముక్కు మూసుకుపోతుంది.”
బెంగుళూరుకు చెందిన దివ్య సోమయాజి తన తొమ్మిదేళ్ళ కుమార్తె అలెర్జీ పరీక్షలో మైట్స్ కారణం అని తెలిసినట్లు చెప్పారు. “నా కూతురికి తరచుగా కళ్ళు ఎర్రగా అయిపోయేవి. కళ్ళు ఉబ్బి, నీరు కారుతూ ఉండేవి. ఇది కళ్ళకు సంబంధించిన సమస్య కావచ్చని ముందుగా నేత్ర వైద్య నిపుణులను సంప్రదించాం. ఆమెకు అలెర్జీ ఉందని చెప్పారు. కంటిలో వేసే డ్రాప్స్ కారణంగా లక్షణాల నుండి కాస్త ఉపశమనం లభించింది. ఆ తర్వాత మేము కలిసిన అలర్జీ నిపుణుడు పరీక్షలు నిర్వహించి డస్ట్ మైట్ ఎలర్జీ అని కనుగొన్నారు” అని సోమయాజి చెప్పారు.
సోమయాజి తన కుమార్తె తన బొమ్మలతో ఆడుకుంటున్నప్పుడు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉంటుంది మరియు ఆమె బొమ్మలన్నీ సరిగ్గా కడిగి చక్కగా ఉండేలా చూసుకుంటుంది. “నా కుమార్తె అదృష్టవశాత్తూ మృదువైన బొమ్మలంటే అంతగా ఇష్టపడదు, కానీ ఆమె వాటితో ఆడుకుంటున్నప్పుడు, మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటాము.అంతే కాకుండా, కనీసం దుమ్ముకు గురికాకుండా ఉండటానికి ఇల్లు ప్రతిరోజూ తుడిచివేస్తాం.” అని ఆమె చెప్పింది.
దివ్య కుమార్తెకు చికిత్స చేస్తున్న బెంగళూరులోని కంగారూకేర్ హాస్పిటల్లోని పీడియాట్రిక్ పల్మోనాలజిస్ట్ మరియు అలెర్జీ స్పెషలిస్ట్ డాక్టర్ సౌమ్య అరుది నాగరాజన్ మాట్లాడుతూ, అమ్మాయికి పోర్స్ మరియు మైట్స్ వల్ల అలెర్జీ ఉందని చెప్పారు. “డస్ట్ మైట్స్ అనేవి మానవుల చనిపోయిన చర్మాన్ని తినే సూక్ష్మ జీవులు. అవి దిండ్లు, పరుపులు మరియు సోఫా కుషన్లు వంటి వాతావరణంలో వృద్ధి చెందుతాయి. అసలు దుమ్ము లేకపోయినా, మైట్స్ వృద్ధి చెందుతాయి. చాలా మంది డస్ట్ మైట్స్గా పొరబడతారు” అని డాక్టర్ నాగరాజన్ చెప్పారు. డస్ట్ మైట్ యొక్క ప్రోటీన్ మల పదార్థం అలెర్జీకి కారణమవుతుందని ఆమె వివరించారు.
2011లో ప్రచురించబడిన పరిశోధన పత్రం, పీడియాట్రిక్ అలర్జీ ఇమ్యునాలజీ, సాఫ్ట్ టాయ్స్ పైన ఉండే హౌస్ డస్ట్ మైట్స్ (HDM) మరియు HDM అలెర్జీ కారకాలకు ప్రధాన మూలం, మరియు ఈ బొమ్మలను దగ్గర పెట్టుకుని నిద్రించడం HDM సున్నితత్వానికి ముఖ్యమైన ప్రమాద కారకం. మృదువైన బొమ్మల నుండి HDMను తొలగించడానికి పరిశోధకులు మూడు పద్ధతులను అధ్యయనం చేశారు, అవి ఫ్రీజింగ్, వాషింగ్ మెషీన్లో హాట్ వాటర్ డ్రైయింగ్ మరియు యూకలిప్టస్ ఆయిల్తో కడగడం. రాత్రంతా ఫ్రీజ్ చేయడానికి ముందు మరియు తర్వాత వేడిమికి గురిచేసే పద్ధతి ద్వారా ప్రత్యక్ష HDM కోసం ముప్పై ఆరు బొమ్మలు (ప్రతి చికిత్స సమూహంలో 12) లెక్కించబడ్డాయి, ఒక గంట పాటు హాట్ టంబుల్ డ్రైయింగ్ మరియు 0.2 శాతం నుండి 0.4 శాతం యూకలిప్టస్ నూనెలో కడగడం చేయాలి. వాషింగ్ మెషీన్లో హాట్ వాటర్ డ్రైయింగ్ మరియు యూకలిప్టస్ ఆయిల్తో కడగడం వల్ల లైవ్ HDM గణనీయంగా తగ్గింది, సగటున 95.1 శాతం, 89.1 శాతం మరియు 95.1 శాతం తగ్గింది.
డస్ట్ మైట్స్ పిల్లోకేసులు మరియు ఏసీ ఫిల్టర్లలో దాక్కుంటాయా?
ఫైవ్ స్టార్ హోటళ్ళతోపాటు ఎక్కడైనా డస్ట్ మైట్స్ కనిపించవచ్చని డాక్టర్ నాగరాజన్ చెబుతున్నారు. “కొన్ని సందర్భాల్లో, పిల్లలు సెలవుదినం నుండి తిరిగి వచ్చిన వెంటనే అలెర్జీ లక్షణాలను మేము చూశాము. సాధారణ లక్షణాలు తుమ్ములు మరియు కంటి నుండి నీరు కారడం. హోటళ్ళలో దిండు కవర్లు మార్చవచ్చు మరియు ఉతకవచ్చు, కానీ దిండ్లు మార్చరు కాబట్టి అవి (డస్ట్ మైట్స్) అలానే ఉంటాయి” అని ఆమె చెప్పింది.
“ఏసీ ఫిల్టర్లు, ముఖ్యంగా కార్లలో ఉపయోగించేవి కూడా డస్ట్ మైట్స్ యొక్క నివాసాలు అలాగే వాటిని ఎప్పటికప్పుడు
శుభ్రం చేయాలి” అని డాక్టర్ నాగరాజన్ చెప్పారు. “ఎయిర్ కండీషనర్లోని చల్లని ఉష్ణోగ్రత డస్ట్ మైట్స్ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది,” అని ఆమె చెబుతుంది.
వ్యాధి నిర్ధారణ
డస్ట్ మైట్ అలెర్జీ నిర్ధారణ మారవచ్చు మరియు అలెర్జీ గుర్తింపు అనేది ఎల్లప్పుడూ తొలగింపు ప్రక్రియ. “తొలగింపు ప్రక్రియలో, పిల్లవాడు ఏమి తిన్నాడు లేదా తాగాడు, పిల్లవాడు ఏ ఉపరితలం తాకాడు మరియు వారు ధరించే దుస్తులను మనం పరిగణనలోకి తీసుకోవాలి” అని డాక్టర్ సేన్ చెప్పారు. అలెర్జీ ఉన్న పిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా డైరీని నిర్వహించాలని ఆమె సూచించారు. సాధ్యమయ్యే అలెర్జీ కారకాలు మరియు తక్షణ కారణాలను కనుగొనడానికి, పిల్లలు ఏమి తిన్నారో మరియు వేటిని తాకారో గుర్తించగలరు.
స్కిన్ ప్రిక్ పరీక్షలు కూడా నిర్వహిస్తారు. అటువంటి పరీక్షలో, అలెర్జీతో బాధపడుతున్న వ్యక్తి వివిధ రకాలైన అలెర్జీ కారకాలు లేదా అలెర్జీ-కారణ పదార్థాలకు గురవుతాడు మరియు అలెర్జీ ప్రతిచర్యల రూపంలో కనిపించే తక్షణ సంకేతాలు వైద్య పర్యవేక్షణలో గమనించబడతాయి.
చికిత్స యాంటిహిస్టామైన్లు మరియు యాంటీ అలెర్జిక్ ఔషధాల రూపంలో ఉంటుంది. “యాంటిహిస్టామైన్లతో మొదటి శ్రేణి చికిత్స ప్రయోజనాలను అందించనప్పుడు మాత్రమే స్కిన్ ప్రిక్ టెస్ట్ నిర్వహించబడుతుంది. అలాగే, అలర్జీ మోస్తరు నుండి తీవ్రంగా ఉంటే, మేము స్కిన్ ప్రిక్ టెస్ట్తో ముందుకు వెళ్తాము, ”అని డాక్టర్ నాగరాజన్ చెప్పారు.
ఒక ‘శక్తివంతమైన‘ పిల్లల దృష్టిని ఆకట్టుకునేది
అలెర్జీలతో బాధపడుతున్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు తరచూ అలెర్జీ ప్రతిచర్యలు పిల్లల దృష్టిని ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు.
సీజన్లో మార్పుతో తన కుమారుడి డస్ట్ మైట్ అలెర్జీ తీవ్రమవుతుందని, అది అబ్బాయి ఏకాగ్రతను ప్రభావితం చేస్తుందని అగర్వాల్ చెప్పారు. “మేము చాలా మంది వైద్యులను సంప్రదించాము. నాసల్ స్ప్రేలు అతనికి సహాయపడతాయి. అయితే దీన్ని ఎప్పటికీ కొనసాగించాల్సిన అవసరం ఉందో లేదో మాకు తెలియదు. మేము ప్రకృతి వైద్యంలో సాల్ట్ థెరపీ వంటి కొత్త చికిత్సలను కూడా అన్వేషిస్తున్నాము. కానీ దుమ్మును నివారించడమే అతిపెద్ద సవాలు” అని అగర్వాల్ చెప్పారు. తన కుమారుడికి ఎలర్జీ ఉన్నప్పటికీ, బురద మరియు ధూళిలో ఆడుకోమని అబ్బాయిని ప్రోత్సహించమని ఆమె చెప్పింది. “ఆ విధంగా అతను రోగనిరోధక శక్తిని పొందుతాడు,” అని అగర్వాల్ చెప్పారు.