భారతదేశంలోని అన్ని ఇ-కామర్స్ పోర్టల్లు బోర్న్విటాతో సహా మరికొన్ని పానీయాలను ‘హెల్తీ డ్రింక్స్’ కేటగిరీ నుండి తొలగించాలని కేంద్రప్రభుత్వం ఆదేశించింది. ఈ-కామర్స్ సైట్లు, ప్లాట్ఫామ్లలో బోర్న్విటాతో సహా కొన్ని పానీయాలు ‘హెల్త్ డ్రింక్స్’గా వర్గీకరించబడినట్లు గుర్తించామని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ కేంద్ర కార్యదర్శి రాజేష్ రంజన్ ఏప్రిల్ 10న జారీ చేసిన అడ్వైజరీలో తెలిపారు.
అనేక భారతీయ గృహాలలో ఉదయం పిల్లలకు తప్పనిసరిగా తినిపించే అనేక రుచికరమైన, రంగు పానీయాలు పరిశీలిస్తున్నాం. పాపులర్ మాల్ట్ ఆధారిత పానీయం గతంలో ఏప్రిల్ 2023లో దాని అధిక చక్కెర కంటెంట్ను హైలైట్ చేసే ఇన్స్టాగ్రామ్ వీడియో వైరల్ అయినప్పుడు పరిశీలనలోకి వచ్చింది.
‘హెల్త్ డ్రింక్’ కేటగిరీ లేదు
అన్ని ఈ-కామర్స్ కంపెనీలకు పంపిన సలహా ఇలా ఉంది: “బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (సిపిసిఆర్) చట్టం 2005లోని సెక్షన్ (3) కింద ఏర్పాటు చేయబడిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సిపిసిఆర్) ఒక చట్టబద్ధమైన సంస్థ. సిఆర్పిసి చట్టం 2005లోని సెక్షన్ 14 కింద దర్యాప్తు చేసిన తరువాత ఎఫ్ఎస్ఎస్ చట్టం 2006 కింద నిర్వచించబడిన ‘హెల్త్ డ్రింక్’ లేదని తేల్చింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ, మాండెలెజ్ ఇండియా ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించిన నియమనిబంధనలు’ అని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అన్ని ఈ-కామర్స్ కంపెనీలకు ఒక సలహాలో తెలిపింది.
‘ఏది ఆరోగ్యకరమైనది, ఏది అనారోగ్యకరమైనదో నిర్వచించండి’
పీడియాట్రిషన్, న్యూట్రిషన్ అడ్వకసీ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ (ఎన్ఏపీఐ) కన్వీనర్ డాక్టర్ అరుణ్ గుప్తా వంటి వైద్యరంగంలోని పలువురు ఈ జీవోఐ చర్యను సరైన దిశలో వేసిన అడుగుగా అభివర్ణించారు. ”ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆరోగ్యకరమైన పానీయం ఏంటో నిర్వచించలేదు. ఆరోగ్యకరమైన ఆహారం, పానీయం అంటే ఏంటో మొదట నిర్వచించాలని, అనారోగ్యకరమైన ఆహారం, పానీయాలు అంటే ఏంటో కూడా నిర్వచించాలని, అంతేగాకుండా పరిధిని కూడా అందించాలని సూచించారు. దీని ఆధారంగా ప్రభుత్వం రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ రూపొందించవచ్చు. ఇలాంటి ఉత్పత్తుల ప్రకటనలను పరిమితం చేయడంలో ఇది ప్రయోజనం చేకూరుస్తుంది” అని డాక్టర్ గుప్తా చెప్పారు. ఉత్పత్తిలో చక్కెర, ఉప్పు/ సోడియం మరియు అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉన్నాయో లేదో సూచించే హెచ్చరిక లేబుల్ సమాచారంతో కూడిన ఎంపిక చేయడానికి సహాయపడుతుందని ఆయన చెప్పారు.
న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లోని కార్డియాలజీ అండ్ సెట్ (స్కిల్స్, ఈ-లెర్నింగ్, టెలీమెడిసిన్) ఫెసిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ అవధేష్ చంద్ర హ్యాపీయెస్ట్ హెల్త్తో మాట్లాడుతూ, బోర్న్విటా వంటి పానీయాలు తీసుకున్న వారి ఆరోగ్య స్థితిని అర్థం చేసుకోవడానికి ఒక అధ్యయనం అవసరం. పిల్లలకు ఇలాంటి పానీయాలు అందిస్తున్న తల్లిదండ్రులపై జాలి చూపిస్తాను. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఇలాంటి ఉత్పత్తులు చాలా ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరూ సరైన ఎంపికలను ప్రోత్సహించాలి. సమతుల్య ఆహారం యొక్క భావనను అర్థం చేసుకోవాలి” అని డాక్టర్ చంద్ర చెప్పారు.
బెంగళూరులోని ఢీ ఆసుపత్రి పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ సుప్రజ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఇంతకు ముందు తరాల పిల్లలకు ఇచ్చిన బోర్న్విటా వంటి పౌడర్లు కేవలం చక్కెర పానీయాలు మాత్రమే. తల్లిదండ్రులు గతంలో ఈ పౌడర్లను ఉపయోగించి తమ బిడ్డ ప్రతిరోజూ రెండు గ్లాసుల పాలు తాగేలా చూసుకునేవారు. కానీ ఇప్పుడు దాని పోషక విలువలు తక్కువగా ఉన్నాయని మరియు అందువల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాన్ని కలిగి ఉండవని అందుకు బదులుగా కార్బోహైడ్రేట్, చక్కెర పానీయం అని మేము గ్రహించాము. కాలం మారడంతో ఇప్పుడు చక్కెరను జీవక్రియ చేసే విధానం మునుపటి కంటే చాలా భిన్నంగా ఉంది. మన జీవనశైలి కూడా మారింది” అని డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు.
పాలలో ఫ్లేవర్డ్ పౌడర్లు వేసి గత తరాల తల్లిదండ్రులు తప్పు చేశారా? ‘తల్లిదండ్రులు తెలిసీ అలా చేయడం లేదు. అప్పుడు, ఇతర చిరుతిండి కేటగిరీల నుండి చక్కెర అంతగా లేదు. ఈ రోజుల్లో కుకీలు, మఫిన్లు, టీ కేకులు, డోనట్స్ చక్కెరతో నిండి ఉన్నాయి. అందువల్ల ఇది చెడు వెలుగులోకి వస్తోంది” అని ఇండియన్ డైటెటిక్స్ అసోసియేషన్, బెంగళూరు చాప్టర్ మాజీ అధ్యక్షురాలు ప్రియాంక రోహత్గీ చెప్పారు.
బోర్న్విటా.. ఇలాంటి పానీయాలకు బదులుగా, తల్లిదండ్రులు తమ పిల్లలకు పాలు, పెరుగు, పండ్ల రసాలు, తాజా పండ్లు లేదా డ్రై ఫ్రూట్స్తో ఫ్రూట్ షేక్ ఇవ్వడం మంచి ప్రత్యామ్నాయమని డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు. ‘ప్యాకేజ్డ్ ప్రొడక్ట్స్లో వచ్చే వస్తువులను ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఈ ఉత్పత్తులు సౌలభ్యం కోసం వచ్చాయి. ఈ సౌలభ్యం కిల్లర్ కావచ్చు” అని ఆమె హ్యాపీయెస్ట్ హెల్త్తో అన్నారు.
ఎనర్జీ డ్రింక్స్ మీకు ఎటువంటి శక్తిని తీసుకురావు. అందుకు బదులుగా ఇవి కెఫిన్తో నిండి ఉండి, వ్యసనపరులుగా మారుస్తాయి అని డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు.
చక్కెర పానీయాలు మీ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?
చక్కెర పానీయాలు తీసుకోవడం పిల్లలు మరియు పెద్దలపై తీవ్రమైన ఆరోగ్య ప్రభావాలను కలిగిస్తుంది. ఢిల్లీకి చెందిన పోషకాహార నిపుణురాలు రితికా దువా ఇది పిల్లలను ప్రత్యేకంగా ఎలా ప్రభావితం చేస్తుందో వివరిస్తుంది.
అనారోగ్యకరమైన బరువు పెరగడం మరియు ఊబకాయం: చక్కెర పానీయాలను అధికంగా తీసుకోవడం వల్ల పిల్లలలో అనారోగ్యకరమైన బరువు పెరగడం మరియు ఊబకాయం వస్తుంది. ఊబకాయం గుండె జబ్బులు, కాలేయ సమస్యలు, మధుమేహం మరియు ఎముక సమస్యలతో సహా వివిధ ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంది.
గుండె జబ్బులు: చక్కెర పానీయాలు రక్త నాళాలను దెబ్బతీస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. దెబ్బతిన్న రక్త నాళాలు చివరికి గుండెపోటుకు దారితీస్తాయి.
దంత క్షయం: చక్కెర పానీయాల వల్ల నోటిలో బ్యాక్టీరియా పెరగడం వల్ల దంతాల ఎనామెల్ నాశనం అవుతుంది మరియు కావిటీస్కు దారితీస్తుంది. చక్కెర పానీయాలను క్రమం తప్పకుండా తీసుకోవడం దంత క్షయానికి దోహదం చేస్తుంది.
ఫ్యాటీ లివర్: అధిక చక్కెర వినియోగం కొవ్వు కాలేయానికి దారితీస్తుంది, ఇక్కడ కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. కాలేయంలో అధిక కొవ్వు.. కాలేయం ముఖ్యమైన విధులను నిర్వహించే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది.
టైప్ 2 డయాబెటిస్: ఎక్కువ చక్కెర పానీయాలు తీసుకోవడం టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇక్కడ ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ ఉత్పత్తిని ఆపివేస్తుంది. ఇది కణాలకు ఇంధనాన్ని అందించడానికి అవసరం.
గుర్తుంచుకోవాల్సిన అంశాలు
ఏప్రిల్ 10న భారత ప్రభుత్వం, వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ బోర్న్విటాతో సహా మరికొన్ని పానీయాలను ‘హెల్త్ డ్రింక్స్’ కేటగిరీ నుండి తొలగించాలని ఈ కామర్స్ సైట్లను ఆదేశించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వచించిన హెల్త్ డ్రింక్ లాంటిదేమీ లేదని తెలిపింది. సమతుల్య ఆహారాన్ని దృష్టిలో ఉంచుకుని పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారంగా ఏం ఇవ్వాలనే దానిపై తల్లిదండ్రులు సరైన ఎంపిక చేసుకోవాలని నిపుణులు అంటున్నారు.